లోకంలో కొందరు మిత్రులు, కొందరు పరిచయస్ధులుంటారు..పరిచయం చిన్నదా ! పెద్దదా? అన్నవిషయం
పక్కనబెడితే..కొన్ని పరిచయాలు ఆకుపచ్చని జ్ఞాపకాలై కలకాలం నిలిచిపోతాయి..ఈరోజు కాఫీ టైమ్లో మనం
మాట్లాడుకుంటున్న రమాదేవి గారి ..కవిత కూడా ఇలాంటి పరిచయ జ్ఞాపకమే…మీరూ
ఓ సారి ఈ కవితను చదవండి.!!
*A bit close to me....
నువ్వు నాకు పరిచయమే కదా
నాలుగు సార్లు కలిసినట్టు
నాలుగు మాటలు మాట్లాడుకున్నట్టు గుర్తు
గత జన్మలో జరిగింది కాదు కదా
కాసింత దగ్గరితనం ఉండే ఉంటుందిలే
ఎన్నెన్నో మాటలు చెప్పుకోలేదు సరే
మాట మాట కూడా అనుకోలేదుగా
మడత పేచీలు అసలెపుడూ లేనేలేవుగా
నీపై హక్కు
మొత్తంగా నాదన్న మాటే రాలేదుగా
ఎంతనో తెలియకున్నా నువ్వు నాకు దగ్గరే కదా
అప్పుడప్పుడు
మాటల నిడివి తగ్గితేనేమి
మాట వరసకైనా
ఒకసారి కనిపించమని అడగవచ్చుగా
లోలోపల చింత
మనసును పొరలు పొరలుగా చీలుస్తోంది
నీ నీడేదో నా నుండి తప్పుకుపోతున్నట్టు
ఓయ్
తప్పంతా నీదని నెపం వేయలేను
కాస్తంత అడుగ అటువైపేసి
పేచీ పడని తప్పు కాసింత నాదేనేమో”!!
*A bit close to me....
*రమాదేవి ఆర్….!!
వారిద్దరూ కలిశారు. మాట్లాడుకున్నారు.పలితంగా వారి మధ్య పరిచయం ఏర్పడింది..నాలుగు సార్లు కలిశారు.
నాలుగు మాటలు మాట్లాడుకున్నారు.ఈ పరిచయం చిన్నదా! పెద్దదా? అన్నది పక్కనపెడితే
వారి మనసుల్ని ముడేసింది..అలా వారిద్దరి హృదయాల్లో తీపి జ్ఞాపకమై నిలిచిపోయింది..
అతగాడు ఆమెకు సన్నిహితమై పోయాడు..హృదయానికి..చేరువ అయ్యాడు (A bit close to Her)..
ఈ పరిచయానికి మూలంగత జన్మబంధం కానవసరం లేదు.ఈ జన్మలోనే కాసింత దగ్గరితనంతో
యేర్పడిందే..
ఈ పరిచయంలో వారిద్దరూ ఎన్నెన్నో మాటలేం చెప్పుకోలేదు..ఎప్పుడూ మాట మాటా కూడా
అనుకోలేదు..ఇద్దరి మధ్య మడత పేచీలు అసలే లేవు.ఎప్పుడూ “నీపై హక్కు మొత్తంగా నాదే”అన్న
మాటే నోటెంట రాలేదు..అటువంటి భావన కించిత్కూడా కలగలేదు.ఆమెకు అతగాడెంతో స్పష్టంగా
తెలియకున్నా… తనకు మాత్రం అతడు దగ్గరే.!
అప్పుడప్పుడూ కలిసినపుడు వారిద్దరి మధ్య…. మాటల నిడివి తగ్గినా! మాట వరసకైనా ఎప్పు
డో ఒకసారి కనిపించమని అతగాడు అడగలేదు..దాంతో ఆమె లోలోపల చింత మనసును పొరలు
పొరలుగా చీలుస్తోంది.అతగాడి నీడ తన నుండి తప్పుకుపోతున్నట్టు అనిపించిందామెకు… “ఓయ్ .! తప్పంతా నీదని నెపం వేయలేను..ఎందుకంటే నువ్వడక్కున్నా,అప్పుడప్పుడూ కలవ్వొచ్చుగా’ అని తానైనా అడిగివుండొచ్చుకదా! ఒకరిని.. తప్పు పట్టే ముందు మనమేంటో కూడా ఆలోచించాలి కదా! అనుకుంది..
నిజమే…
తానైనా….కాస్తంత అడుగ అటువైపేసి వుండొచ్చు. కానీ అలా జరగలేదు..పేచీ పడని తప్పు కాసింత
తనదికూడా కదా ! అనుకుంది.. ఒక్కోసారి ఎదుటివారిపై వేలుపెట్టి చూపేటప్పుడు,మన గురించి కూడా ఆలోచించాలి.మనల్ని మనం ఆత్మ పరిశీలనచేసుకోవాలి.అప్పుడే నిజం నిఖార్సుగా తెలుస్తుంది..
పరిచయం వారిద్దరిని దగ్గరచేస్తే…చొరవలేనితనం వారి పరిచయానికి ‘బ్రేక్’ వేసింది..అందుకే మనుషు
లన్నాక మాట్లాడుకోవాలి.ఇక ప్రేమికులైతే మనసు విప్పి మరీ మాట్లాడుకోవాలి. ప్రేమలో మొఖమాటా
లుండరాద..ఎప్పుడూ ఓ అడుగు ముందుంటేనే.. ఆ పరిచయం,ప్రేమ నిలబడుతుందన్నది రమాదేవికవిత సారాంశం..!!
*ఎ.రజాహుస్సేన్..!!